చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఈస్ట్ జోన్ డిసిపి
పరకాల మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకొని పరకాల పట్టణ మున్సిపల్ సరిహద్దుల్లో నాలుగు స్టాటిక్ సర్వ లైన్స్ టీంలతో ఏర్పాటు చేసిన హన్మకొండ, హుజురాబాద్,చలివాగు బ్రిడ్జ్ వెల్లంపల్లి మార్గాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టులను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న తీరుపై డీసీపీ చెక్ పోస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ కేంద్రాల్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. డీసీపీ వెంట పరకాల ఏసీపీ సతీష్ బాబు, ఇన్స్ స్పెక్టర్ క్రాంతి కుమారు పాల్గొన్నారు.